UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత…అశాంతి వాతావరణం

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో దాయాది దేశంలో ఒక్కసారిగా అశాంతి వాతావరణం నెలకొంది. అరెస్టు తర్వాత దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఘర్షణలను నియంత్రించేందుకు ప్రభుత్వం.. సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పతనమైంది.

గురువారం నాటి ట్రేడింగులో డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ 3.3 శాతం పడిపోయి 300 వద్ద జీవనకాల కనిష్ఠానికి తగ్గిపోయింది. అలాగే, 2031తో ముగియనున్న డాలర్ బాండ్ల విలువ అమాంతం పెరిగి 33.44 శాతానికి చేరింది.

అల్ ఖదీర్ భూ కుంభకోణం కేసులో ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌‍ను పాకిస్థాన్ పోలీసులు ఇస్లామాబాద్ హైకోర్టు పరిధిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అవినీతి నిరోధక కోర్టు ఆయనకు 8 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలో అల్లర్లు చెలరేగడంతో ఆందోళనలను అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. దీంతో పాక్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ పీకల్లోతు ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకునిపోయింది. నిత్యావసర ధరలు భగ్గుమనడంతో తిండి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు విదేశీ మారకపు నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి. అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రస్తుతం పెండింగు ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు పాక్ చర్చలు జరుపుతున్నా అవి ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కన్పించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ అరెస్టుతో పాక్ రణరంగంగా మారింది. దేశ పరిస్థితులు కూడా మరింతగా దిగజారిపోయాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !