UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 క్రీడల్లో గెలుపోటములు సమానం …. • ఎంపీపీ బానోత్ పార్వతి

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, మే 17: క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని , ఓటమిని గెలుపుకు పునాదిగా చేసుకొని ముందుకు పోవాలని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సిఎంకప్ క్రీడా పోటీల ముగింపు సభలో ఆమె పాల్గొని, క్రీడకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..మూడురోజుల పాటు జరిగిన క్రీడల్లో వాలీబాల్-16, కబడ్డీ-8, ఖోఖో-4టీంలు పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో యువతి,యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం జరిగిందన్నారు. క్రీడలతో మంచి గుర్తింపు పొందవచ్చని, ఉపాధి అవకాశాలు సైతం అందిపుచ్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ రేవతి, ఎంఈఓ సత్యనారాయణ,డిప్యూటి తహసీల్దార్ ఎల్ ప్రసన్న, ఎంపిఓ తోట తులసీరాం, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపిటీసీలు లంకా విజయలక్ష్మి, నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, సర్పంచ్ పద్దం వినోద్, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !