మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలం ఎల్చిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ ఐలాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల మైదానంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అధికారులు అందజేశారు. సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం తో ముగిశాయన్నారు. మండల స్థాయి సీఎం కప్ క్రీడల్లో ఖో ఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు ఎంపీపీ గుమ్మడి గాంధీ , ఎమ్మార్వో ప్రసాద్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 22, 23, 24 తేదీలలో జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సామ్రాజ్యం , సూపర్డెంట్ శ్రీనివాస్ ,ఇన్చార్జ్ ఎంపిఓ జైపాల్ రెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, పీడీ ఆదినారాయణ, పీఈటీలు పోలబోయిన అనిల్ , వీరన్న, బాయమ్మ ,నరేష్ , సెక్రటరీలు, పంచాయతీ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.