జీతాలు పెంచుకుంటే సమ్మె తీవ్రతరం చేస్తాం.
– జిల్లా లేబర్ అధికారికి వినతి పత్రాన్ని అందజేసిన నాయకులు.
– కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి .
— సీఐటీయూ డిమాండ్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
:ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న అద్దె బస్సులు డ్రైవర్లు హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ తో పాటు అద్దె బస్సు కార్మికులు కలిసి జిల్లా లేబర్ అధికారి షర్డుద్దిన్ కి గురువారం వినతి పత్రాన్ని సమర్పించారు. గత నెల రోజులుగా సమస్యల పై దశల వారీగా శాంతి యుతంగా కార్యక్రమాలు చేస్తుంటే ఏమి పట్టనట్లు గా వ్యవహరించడం సరికాదని, జీతాలు వివరాలు, సమస్యలు పై క్షుణ్ణంగా జిల్లా అధికారి షర్గుద్దిన్ కి వివరించడం జరిగింది. ఈ సందర్బంగా భూక్యా రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగస్తులకు సమానంగా పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని కనీస వేతన అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఒకటే అయినప్పుడు వేతనాలు ఎందుకు తేడా చేస్తున్నారొ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. యూనియన్లు పెట్టొద్దని, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయొద్దని, ఒకవైపు బిజెపి ప్రభుత్వం మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులపై నిర్బంధాలను ప్రయోగించి ఉద్యమాలను విచ్చిన్నం చేస్తున్నారన్నరు. కార్మిక హక్కులు కాల రాస్తున్నారని ఆయన విమర్శించారు. అద్దె బస్సు కార్మికులకు వేతనాలు పెంచే వరకు దశలవారు ఉద్యమాలు నిర్మిస్తామని తెలిపారు . దశల వారీగా ఉద్యమాలు శాంతి యుతంగా ఐక్యంగా చేస్తున్నా కూడా బస్సు యజమానులు ఏమి పట్టనట్లు గా వ్యవహరించడం సరికాదని అన్నారు. తమరు చొరవ తీసుకుని కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. ఇప్పటికైనా స్పందించకుంటే పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల పక్షాన సీఐటీయూ నికరంగా పోరాటం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెర్ బస్ అధ్యక్ష కార్యదర్శులు సైదులు, నరసింహా , శ్రీకాంత్, ఆదినారాయణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.