UPDATES  

 కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే వనమా సమీక్ష

కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే వనమా సమీక్ష
..

కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే వనమా ఆదేశించారు.

పాత పాల్వంచలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో పంచాయతీ పనులను వెంటనే చేపట్టాలన్నారు.

ప్రతి పంచాయతీకి స్పెషల్ ఫండ్స్ కింద సీఎం కేసీఆర్ పది లక్షలు కేటాయించారన్నారు. స్పెషల్ ఫండ్స్ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఎమ్ ఎన్ ఆర్ ఈ జి ఎస్ వర్క్ లపై చర్చించారు.

వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి పంచాయతీరాజ్ డిఇ వేణుగోపాల్, ఏఈలు సేవాలాల్, అనిల్, నాగేందర్, ఎంపీడీవోలు రమేష్, అప్పారావు, విజయలక్ష్మి, మంగమ్మలు, ఎంపీవోలు జి సత్యనారాయణ, ఖాన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !