UPDATES  

 పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ మే 25 : ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం మండల నాయకులు పెద్దిని వేణు డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిప్యూటీ తహసిల్దార్ ఎల్ ప్రసన్నకు వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ… అద్దె ఇండ్లలో ఉండలేక, కిరాయిలు కట్టలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామపంచాయతీలో 1400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని,ఆ భూమిని గుర్తించి, పేదలకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాయి రాజా, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, సీతారాములు, చల్లపల్లి రాజా, పవన్ కళ్యాణ్,కొండ వంశీ, కంభంపాటి కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !