UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌ కంపెనీ ఒక్కో షేర్‌ను రూ. 294 ధరకు కొనుగోలు చేయనుంది. ఈ ఆఫర్‌ కోసం తాము రూ. 492.81 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఓపెన్‌ ఆఫర్‌ అక్టోబర్‌ 17వ తేదీన ప్రారంభమౌతుంది. నవంబర్‌ 1వ తేదీన ముగుస్తుంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లకు చెందిన 29.18 శాతం షేర్లను తాము కొనుగోలు చేసినట్లు అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్‌, ఎన్‌డీటీవీలు సెబీని ఆశ్రయించాయి. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ కూడా ఎన్‌డీటీవీ షేర్‌ 5శాతం లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ట్రేడవుతోంది. రూ. 573 తాకిన ఈ షేర్‌ ఇవాళ రూ. 468 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద 7.74 లక్షల షేర్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కాని కొనుగోలుదారులు లేరు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !