UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఫోన్ చూసే సమయంలో ఇలా చేస్తే ఆరోగ్యం పదిలం !

[ఈ మధ్యకాలంలో జనాలకి ఫోన్ చేతిలో లేకుండా పూట గడవడం కష్టంగా మారింది. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పక్క మీదకు చేరే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే.
కొందరు మాత్రం ఇంకో అడుగు ముందుకు వేసి బాత్రుమ్స్ లోకి సైతం ఫోన్ తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. మరికొందరైతే ఫోన్ చూస్తూనే నిద్రలోకి జారుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఉదయం నిద్రలేవగానే ఫోన్ చేతిలో పట్టుకుని సమయం వృదా చేసే బదులు ఇలా కనీసం 15 నిమిషాలు చేసినా మీ ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడ్డానికి బదులు ఏదైనా పుస్తకం చదివితే మానసిక ప్రశాంతత ఉంటుంది.

మానసికంగా ప్రశాంతంగా ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యం లభిస్తుంది. కనుక ఉదయం కనీసం 20 నిమిషాలు బుక్ చదడం వల్ల ఆరోగ్యానికి మంచింది. ఉదయం మెడిటేషన్ చేయడం ద్వారా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అనేక విధాలుగా ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా యోగా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది. యోగాను కనీసం 20 నిమిషాలు చేస్తే చాలని నిపుణులు కూడా చెబుతున్నారు. కనుక ఫోన్ చూసే సమయంలో యోగా చేస్తే ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. వాకింగ్‌ చేయడం ద్వారా కూడా ఆరోగ్యం ను కాపాడుకోవచ్చు.

ఉదయం ఫోన్ చూసే 30 నిమిషాల్లో కనీసం 15 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా ప్రయోజనాలు చాలా పొందవచ్చు. ఉదయం ఫోన్ లో ఎక్కువ సమయం గడపడం కంటే న్యూస్ పేపర్ ను తిప్పేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఒక మంచి అలవాటుగా కూడా భావించవచ్చు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !