బిఆర్ఎస్ కార్యకర్తకు నివాళులు అర్పించిన సర్పంచ్ కొమరం జంపేశ్వరి
అంతిమ సంస్కారాలకు 5000 వేల రూపాయల ఆర్ధిక సాయం.
మన్యం న్యూస్ మణుగూరు :ఆగష్టు 13
మణుగూరు మండలం లోని ముత్యాలమ్మనగర్ గ్రామానికి చెందిన గూడెల్లి మునిరాజ్ బోన్ క్యాన్సర్ వ్యాధిబారిన పడి మరణించారు.విషయం తెలుసుకొని స్థానిక సర్పంచ్ కొమరం జంపేశ్వరి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ముత్యాలమ్మనగర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మునిరాజ్ అంతిమ సంస్కారాల నిమిత్తం వారి కుటుంబానికి 5000 వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేయడం జరిగింది.భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఉన్న అండగా ఉంటామని వారికి భరోసా కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం జంపేశ్వరి,సర్పంచ్ ఏనిక ప్రసాద్,గ్రామ అధ్యక్షులు మధార్ హుస్సేన్,మేకల రవి,శ్రీను,వెంకట నారాయణ,మేరుగు ఈశ్వరయ్య,హుస్సేన్,కుర్ధూస్,బోడ శ్రీను,తోట వెంకటేశ్వర్లు,గుంటక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.