UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల సమావేశం.

అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల సమావేశం.

మన్యం న్యూస్, బూర్గంపహాడ్:- మండల పరిధిలోని ఐటీసీ గెస్ట్ హౌస్లో సమావేశానికి హాజరైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు మరియు ఇతర అధికారులు,తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించడానికి మంగళవారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా,ఎన్నికల సమయంలో మద్యం,నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు.రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు.గంజాయి , ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది.ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల,సుకుమా జిల్లా కలెక్టర్ హరీష్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్,ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అలం,జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ పి.కరుణాకర్,భద్రాచలం ఐటిడిఎ పీఓ ప్రతీక్ జైన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !