UPDATES  

 తెల్లంని మర్యాదపూర్వకంగా కలిసిన యాదవ సంఘం సభ్యులు

 

తెల్లంని మర్యాదపూర్వకంగా కలిసిన యాదవ సంఘం సభ్యుల.

మన్యం న్యూస్ భద్రాచలం:-భద్రాచలం యాదవ సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కైవసం చేసుకున్న సందర్భంగా మంగవారం తెల్లం వెంకట్రావుని పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాచలం యాదవ సంఘం సభ్యులు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు వారితో మాట్లాడుతూ,భద్రాచలం యాదవ సంఘం భవన నిర్మాణానికి త్వరలోనే సుమారు 50 లక్షల రూపాయలతో యాదవ సంఘం భవన్ కి ఏర్పాటుకి కృషి చేస్తానని అదే విధంగా యాదవ సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు.అదే విధంగా భద్రాచలంలో అంతర్భాగంగా ఉండి ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపడం,భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవాలయం అభివృద్ధి,గోదావరి వరద నివారణకు కరకట్టల నిర్మాణం చేయడం వంటి విషయాలపై కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి హామీ ఇవ్వాలని యాదవ సంఘం నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం యాదవ సంఘం ప్రెసిడెంట్ జెట్టి రామకృష్ణ యాదవ్,వైస్ ప్రెసిడెంట్ గోసుల శ్రీనివాస్ యాదవ్,యాదవ సంఘం సీనియర్ నాయకులు రాసాల నరసయ్య,జంగిలి సంపత్ యాదవ్ తో పాటు యాదవ సంఘం యూత్ నాయకులు గోళ్ళ గణేష్,సాని ముత్యాలరావు,అశోక్,గోళ్ళ రామకృష్ణ,బాసు బోయిన అజయ్,సాయి,జక్కుల అజయ్,రాంబాబు,శ్రీను,సైదులు,రామకృష్ణ మొత్తం 50 మంది సభ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !