UPDATES  

 ఏడవ రోజుకు చేరిన సెకండ్ ఏఎన్ఎంల ఆందోళన.

ఏడవ రోజుకు చేరిన సెకండ్ ఏఎన్ఎంల ఆందోళన.

-మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీల నాయకులు.

మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 22

సెకండ్ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ,రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎమ్ లు ఆందోళన కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఏడవ రోజు మణుగూరు ఎంపీడీవో కార్యాలయం ముందు నిర్వహిస్తున్న దీక్ష శిబిరాన్ని మంగళవారం ఏఐటీయూసీ,సిపిఐ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ,మణుగూరు మండల పట్టణ కార్యదర్శి లు జంగం మోహన్ రావు,దుగ్యాలసుధాకర్ మాట్లాడుతూ,సెకండ్ ఏఎన్ఎంల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,ఒకవైపు డెంగ్యూ,మలేరియా,విష జ్వరాలతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని,ఇప్పుడు వీరి సేవలను ప్రభుత్వం తీసుకోవాలని లేదంటే పేద ప్రజలకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.గతంలో పేద ప్రజలకు సేవ చేయడం కోసం వీరిని విధులకు తీసుకొని 17 సంవత్సరాల నుంచి వీరి సేవలను పొందుతున్నారన్నారు.ఇప్పుడు వీరిని కరివేపాకుల తీసి పారేయకుండా వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని, ఏఎన్ఎంల న్యాయమైన డిమాండ్ ను పరిశీలించి పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.సెకండ్ ఏఎన్ఎంలు చేస్తున్న దీక్షలకు మణుగూరు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి గోడిశాల రాములు,కాంగ్రెస్ పార్టీ పినపాక నాయకులు తోలం నాగేశ్వరరావు తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మణుగూరు మండల కార్యదర్శి అక్కి. నరసింహారావు,గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సోందే.కుటుంబరావు, ఎస్కే సర్వర్,మంగి వీరయ్య,ఏఎన్ఎంలు ఇందిరా,సుమలత,రాదా,సంధ్య, పార్వతి,సుజాత,శాంతకుమారి,ఈశ్వర,రాణి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !