UPDATES  

 కాంగ్రెస్ తోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ తోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం
* రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం
* కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
తెలంగాణలో సంపూర్ణంగా అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలతో పాటు రైతుల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీ నేనని పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్ లోని “ప్రజా చైతన్య సభ” జరిగింది. ఈ సభకు రేణుక చౌదరి పాల్గొని మాట్లాడారు. కొత్తగూడెం గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని పేర్కొన్నారు. ఎంత మంది స్థానికేతరులు ఇక్కడికి వచ్చి తిరిగినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం ఉంటుందన్నారు. అందరూ కష్టపడి పని చేసి కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించి సోనియమ్మకి భాహుమతిగా ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వందల కే సిలిండర్, దళితులకు మూడు ఏకారాల భూమి, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రైతు పండించిన ప్రతి గింజాకు గిట్టు బాటు ధర ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
*రేణుక చౌదరికి ఘన స్వాగతం..*
కొత్తగూడెం పట్టణంలో జరిగిన “ప్రజా చైతన్య సభ”కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరికి ఘన స్వాగతం లభించింది. ముందుగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు జరిగింది. బస్టాండ్ సెంటర్ నందు అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ, నేషనల్ ఓబీసీ కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి, రంగారావు, జలీల్, రాయల శాంతయ్య, లక్ష్మణ్, కొప్పుల రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !