- కాంగ్రెస్ కి కడుపు మంట
- ప్రభుత్వవిప్ రేగా కాంతారావు ధ్వజం
- తెల్లంను గెలిపిస్తే కరకట్టకు శాశ్వత పరిష్కారం
- భద్రాద్రి జిల్లాలో ఐదు స్థానాలు పక్కా
భద్రాచలం
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచక అవాకులు, చెవాకులు పేలుతున్నారని, బిఆర్ఎస్ కు లభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ కు కడుపుమంటగా ఉందని ప్రభుత్వవిప్ రేగా కాంతారావు ధ్వజమెత్తారు. భద్రాద్రి జిల్లాలో ఐదు స్థానాలు పక్కాగా సాధిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని హరిత టూరిజంలో హోటల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , ఎమ్మెల్సీ తాత మధు, భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచక అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. 2200 కోట్లతో కరకట్ట నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు చేశారు. కానీ నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కరకట్టలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ను గ