UPDATES  

 ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

 

మన్యం న్యూస్,ఇల్లందు:సోదరీ సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ పండుగ. రాఖీ పండుగను పురస్కరించుకొని గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ కుమారస్వామి, మేనేజర్ అంకుషావలిలకు మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులు రాఖీకట్టి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం చైర్మన్ డీవీ మాట్లాడుతూ..భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి ప్రతీకగా సోదర సోదరీమణుల ఆత్మీయబంధానికి వేదిక రక్షాబంధన్ అని, తనకు రాఖీకట్టిన ప్రతిఒక్క కార్మికురాలికి హృదయపూర్వక రాఖీపండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు మాపైచూపే ప్రేమ ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మనమంతా ఒక కుటుంబంగా ఉంటూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే మన ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుదాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, జవాన్లు అంజద్, ప్రకాష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !