UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అనేది అంత సులువు ఏం కాదు.

2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏపీలో ఎవరిది అధికారం. వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుందా? రెండు పార్టీలు మాత్రం హోరాహోరీగా పోటీ పడనున్నాయి. అధికార వైసీపీ పార్టీ మాత్రం ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా అంతే. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి 2024 ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో సరిగ్గా తెలియదు. ఏ క్షణంలో అయినా జరగొచ్చు. ముందస్తు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ముందస్తు వచ్చినా ఎన్నికలకు రెడీ అయ్యేందుకు టీడీపీ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలను ఖరారు చేస్తోంది.

అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అనేది అంత సులువు ఏం కాదు. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీ బలంగా ఉంది. అంత ఈజీగా వైసీపీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా అభ్యర్థులను కూడా చంద్రబాబు ముందే ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ లందరికీ టికెట్లను ముందే ప్రకటించారు. టీడీపీ నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇది వరకులా కాకుండా చంద్రబాబు రాజకీయాలు ఈసారి దూకుడు రాజకీయం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఒక రెండు సీట్ల విషయంలో మాత్రం చంద్రబాబుకు ఏం అర్థం కావడం లేదు. చంద్రబాబు తీవ్ర మొహమాట పడుతున్నారు.

కానీ..చంద్రబాబు ఇలాంటి అలవాటును వదిలించుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుని, మైదుకూరు నియోజకవర్గాల విషయంలోనే చంద్రబాబు ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. మైదుకూరు సీటును డీఎల్ రవీంద్రారెడ్డి ఆశిస్తున్నారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా మైదుకూరు నుంచే పోటీ చేస్తా అని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో చంద్రబాబుకు పాలుపోవడం లేదు. ఇప్పటికే సుధాకర్ యాదవ్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరోవైపు తుని నుంచి కూడా యనమలకు సీటు ఇస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకంటే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వాళ్లకు సీట్లు ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈ రెండు సీట్ల విషయంలో చంద్రబాబుకు క్లారిటీ లేకపోతే ఆ సీట్లు మాత్రం వేరే పార్టీకి దక్కే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !