UPDATES  

 అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి

  • అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలి
  • అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం
  • గ్రామాలలో బిఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలం లోని సమితిసింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ లో వార్డ్ మెంబర్ బర్మావత్ నరసింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్ సమన్వయకర్తగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.సీఎం కేసీఆర్ ప్రతి ఆడబిడ్డకు,కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,116 రూపాయలు ఆడబిడ్డ కు జన్మనిస్తే 13వేలు మగ బిడ్డకు జన్మనిస్తే 12 వేలు కేసీఆర్ కిట్టు,ఒంటరి మహిళ లకు,వితంతువులకు,వికలాంగులకు,ఆసరా,పింఛన్లు,అందజేయడం,జరుగుతుందన్నారు.రైతుల సంక్షేమం కోసం రైతు బంధు,రైతు బీమా, రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ లాంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు.దళిత బంధు, బీసీ బంధు,మైనారిటీ బంధు, వంటి పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.పినపాక నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు మంజూరు చేయించి,ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు.ఇందులో భాగంగా సిసి రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ మెరుపు పరచడం,100 పడకల హాస్పటల్ లో నాణ్యమైన వైద్యం,పాలిటెక్నిక్ కాలేజీ,నూతన గ్రంథాలయ భవనం,మణుగూరు లో పోస్టుమార్టం సెంటర్,వైకుంఠ ధామాలు,హెల్త్ సబ్ సెంటర్లు, పల్లె ప్రకృతి వనాలు మణుగూరు పట్టణం లో సెంటర్ లైటింగ్ ఇలా ప్రతి ఒక్కటి మునుపెన్నడూ లేని విధంగా కొన్ని వందల కోట్ల వ్యయంతో పినపాక నియోజకవర్గం ను అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు రానున్న ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ బోడ బీరమ్మ, ఎల్లయ్య,ఇస్లావత్ దాలియా, ఆకునూరి పోశం అధిక సంఖ్య లో తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !