UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్

ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్

మావోయిస్టులకు సహకరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు…… సిఐ రాజగోపాల్

మన్యం న్యూస్ చర్ల;
నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని చర్ల సీఐ రాజగోపాల్ అన్నారు.సిపిఐ (ఎంఎల్) ప్రజాపంధా పార్టీ డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్న కొండా చరణ్ గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి కొరియర్ గా వ్యవహరిస్తున్నాడని పొలీసులకు సమాచారం ఉందని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో కొండా చరణ్ పై కొన్ని రోజులుగానిఘా పెట్టడం జరిగిందన్నారు.రోజు వారి కార్యక్రమాలలో భాగంగా ఆదివారం చర్ల మండలంలోని చింతగుప్ప గ్రామంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా,అదే సమయంలో అటుగా వస్తున్న కొండా చరణ్ ని వివరాలు అడుగగా పొంతనలేని సమాదానం చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందన్నారు.ఈ క్రమంలో చరణ్ వద్ద మావోయిస్టు వారోత్సవాలకు సంభందించిన పొస్టర్లు, బ్యానర్లతో పాటు పేలుడు సామాగ్రి లభ్యమైయ్యాయని తెలిపారు.దీంతో కొండా చరణ్ పై కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు.మావోయిస్టుపార్టీ మరి కొంత మంది సహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారు తమ పద్దతి మార్చుకోకపొతే వారిపైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !