UPDATES  

 క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుంది.

మన్యం న్యూస్, మంగపేట.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మండల కమిటీ ఆధ్వర్యంలో గంపోనిగుడెం బీసీ హాస్టల్ అవరణలో కబడ్డీ క్రీడలు ప్రారంభమయ్యాయి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డి వై ఎఫ్ ఐ మాజీ జిల్లా అద్యక్షులు జాగతి చిన్నా ప్రారబించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం నిరుద్యోగ యువత సమస్యలపై ఆందోళన పోరాటాలను నిర్వహిస్తూ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసి ఎంతో మంది యువకులను మంచి మార్గంలో నడిపించిన ఘనత డివైఎఫ్ఐ కి ఉందన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని గుర్తించి క్రీడా నైపుణ్యతను పెంచడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు.యువతను ఏ రకంగానూ ముందుకు నడిపించని తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పోర్ట్స్ డెవలప్మెంట్ కి నిధులు కేటాయించకపోవడం దారుణం అన్నారు వారిలో నైపుణ్యతను గుర్తించి యువతలో మానసిక ఉల్లాసం ,స్నేహం మంచితనం వైపు నడిపించడం కోసం క్రీడలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల కార్యదర్శి చిట్యాల రాజేష్ ఎల్ పి రమేష్ నరేందర్ నరేష్ సందీప్ దిలీప్ రాజశేఖర్ కుమార్ శీను తదితరులు 200 మంది యువకులుపాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !