మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని కారుకొండ రామవరం, తెలగర రామవరం, గడ్డి గుట్ట గ్రామంలో ఎమ్మెల్యే వనమా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కాంగ్రెస్ కి ఓటేస్తే మూడు గంటల కరెంట్, బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే 24 గంటల కరెంట్ కావాలో ప్రజలు రైతులు నిర్ణయించుకోవాలన్నారు.
కారు గుర్తుకు ఓటేస్తే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం అందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు అందుతున్నాయని వివరించారు. కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో కొత్తగూడెంను
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు విద్యారంగం అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వనమా వెంకటేశ్వరరావు అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు వనమాకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.