UPDATES  

 ప్రజాపంథా పార్టీలు పలు కుటుంబాలు చేరిక..కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి..

మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలోని 20 కుటుంబాలు ప్రజాపంథా పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య పార్టీలో చేరిన వారికి 60 మందికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారని పేదవారు నానాటికి ఇంకా పేదవారిగానే మిగిలిపోతున్నారని అన్నారు. మార్చి నెలలో ఖమ్మం కేంద్రంలో జరిగే బహిరంగ సభకు 20వేల మందిని తరలించి సభను విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయల చంద్రశేఖర్, నాయిని రాజు, డివిజన్ కార్యదర్శి శంకర్, వాంకుడోత్ అజయ్, మాచర్ల సత్యం, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !