జూబ్లీహిల్స్ లో ఫేమస్ కుమారి అంటీ ఫుడ్ సెంటర్ పై వేటు పడింది. సాఫ్ట్ వేర్ కంపెనీల మధ్య రోడ్డు పక్కన ఫుడ్ సెంటర్ పెట్టి క్వాలిటీ ఫుడ్ ను తక్కువ ధరలో అందిస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. దీంతో నగరం నలుమూలల నుండి ఆమె వద్దకు అధికంగా జనాలు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఫుడ్ సెంటరుకు పర్మిషన్ లేదనే కారణంగా ట్రాఫిక్ అధికారులు ఫుడ్ సెంటర్ ను అక్కడ నుంచి తొలగించాలని ఆదేశించారు.
