UPDATES  

 బడ్జెట్ సమావేశాలు.. ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత…

పార్లమెంటులో తర్వలో జరగబోయే బడ్జెట్ సమావేశాల దృష్ట్యా.. అందరు ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు శీతకాల సమావేశాల్లో 136 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

 

జనవరి 31 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఎంపీలందరూ హాజరుకావాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ తెలిపింది.

 

లోకసభ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ జనవరి 11 నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ని రద్దు చేస్తున్నట్లు మంగళవారం జనవరి 30న పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !