UPDATES  

 ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తారని జనసేన లీకులు

`చంద్రబాబు ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రి అమిత్ షా కారు మీద రాళ్ల దాడి జరిగింది. ఆయన టైమ్ లోనూ ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని బీజేపీ తప్పుబడుతోంది` అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తాజా రాజకీయా పరిణామాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి.

జనసేనతో కలిసి బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత చెప్పిన మాటలవి. ఢిల్లీకి పవన్ ను బీజేపీ అగ్రనేతలు పిలిచారని బుధవారం మీడియా హల్ చల్ చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తారని జనసేన లీకులు ఇచ్చింది. సీన్ కట్ చేస్తే, ఢిల్లీ వెళ్లిన ఆయన ఇప్పటి వరకు ఎవర్నీ కలిసిన దాఖలాలు లేవు. కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మాత్రమే భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !