UPDATES  

 అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణం..

బూర్గంపహాడ్ 25 న్యూస్ 9

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామంలో పవిత్ర గోదావరి నది తీరాన కొలువై ఉన్న రుక్మిణి సత్యభామ సమేతుడైన విరాట స్వరూప అష్టభుజశక్తి ఆశీస్సులతో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నమందు కళ్యాణ్ మహోత్సవం మేళ తాళాలు వేదమంత్రలతో అంగరంగ వైభవంగా శ్రీ తాళ్లూరి పంచాక్షరి అయ్యా గారు అనిత రాణి దంపతులు మరియు వంశీకృష్ణ దంపతులు వారి చేతుల మీదుగా కళ్యాణం జరిపించారు.

 

ఈ కళ్యాణమోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం తిలకించి దేవుని తీర్థప్రసాదాలు సేకరించి దేవుని కృపకు పాత్రులు అయ్యారు.

అనంతరం భక్తులందరూ దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసిన భోజన ప్రసాదాలు భక్తులు స్వీకరించారు.

 

శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో తాళ్లూరీ పంచాక్షరయ్య గారు ,అనిత రాణి గారి దంపతులు , కుటుంబ సభ్యులు వంశీకృష్ణ ex mptc వారి సతీమణి మరియు జడ్పిటిసిగారుబూర్గంపాడు, బిక్కసాని శ్రీనివాసరావు గారు సొసైటీ చైర్మన్, జగదీష్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దలు భక్తులు వేల సంఖ్యలోపాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !