UPDATES  

 అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు..

  • అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
  • నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు
  • పోలీస్ ఆధ్వర్యంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ దళ సభ్యుల కుటుంబాలకు కౌన్సిలింగ్

మన్యం న్యూస్ చర్ల:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకొని తమ ఉనికి కోసం,స్వార్ధ ప్రయోజనాల కోసం వారిచేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకులుగా మావోయిస్టులు వ్యవహారిస్తున్నారని అన్నారు.చిన్న చిన్న సమస్యలు,కారణాల వలన కుటుంబాలను వదిలేసి తెలిసీ తెలియక మావోయిస్టు పార్టీలోకి వెళ్లి చాలామంది అమాయకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు.వారందరూ తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి పోలీసు వారు వారి కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు.జిల్లా నుండి నిషేధిత సిపిఐ పార్టీలో పనిచేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వం నుంచి వారికి అందే అన్ని రకాల ప్రతిఫలాలను పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

 

ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి స్పందించి నలుగురు దళ సభ్యుల లొంగుబాటు

 

చర్ల మండలం బూరుగుపాడుకి చెందిన వంజం దేవా,కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్ కుమార్, చతిస్గడ్ సుకుమా జిల్లా జేగురుగొండ మండలం తిమ్మాపూర్ కు చెందిన సోడి గంగు,సుకుమా జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కల్మ దేవే లు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల వేధింపులు తట్టుకోలేక శుక్రవారం పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి. సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పి ఫారితోష్ పంకజ్ ఐపీఎస్, సిఆర్పిఎఫ్ 51 బి ఎన్ అడిషనల్ కమాండర్ సునీల్ కుమార్, 144 బిఎన్ సి ఆర్ పి ఎఫ్ కమాండర్ రాజ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, దుమ్ముగూడెం సీఐ బి అశోక్, ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, రమేష్, అశోక్ రెడ్డి, నర్సిరెడ్డి, సూరి, పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !