ఉత్తరాఖండ్లోని పర్వతశ్రేణుల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ట్రెక్కింగ్కు వెళ్లిన వారిలో ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. ఎగువ హిమాలయాల్లోని సహస్త్రతల్ లేక్ దగ్గరకు 22 మందితో కూడిన బృందం ట్రెక్కింగ్కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన వారిలో 9 మంది చనిపోగా.. మరికొందరు మంచులో చిక్కుకుపోయారు. వారిలో పదిమందిని ఉత్తరాఖండ్ డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మిగతా ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది.