UPDATES  

 విద్యుత్ సమస్యలపై ప్రజావాణి..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం జూన్ 17::

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దుమ్ముగూడెం సబ్ ఏఈ రాజేష్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను దరఖాస్తుల ద్వారా ఇవ్వాలని చెప్పారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 3 ఫిర్యాదులు వచ్చాయి అన్నారు .వినియోగదారులు చేసే ఫిర్యాదులను సమీక్షించి సకాలంలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు ప్రజావాణిని సమస్యలు తెలిపి పరిష్కారం దశగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలానే ప్రభుత్వం అధించే జీరో బిల్ రాని వారు ఎంపీడీఓ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి అని చూసించారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !