మన్యం న్యూస్ గుండాల:ప్రజల సమస్యలు పరిష్కారం ప్రజలంతా ఉద్యమించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గుండాల ఎంపీపీ ముక్తిసత్యం అన్నారు.
సోమవారం మండలం పరిధిలోని కోడవటంచ గ్రామంలో విలేకర్ల సమావేశంలో తను మాట్లాడుతూ కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల ప్రజలు వర్ష కాలంవస్తే దిన దిన గండంగా గడిపే పరిస్థితి వచ్చిందని కిన్నెరసాని,ఏడు మలకల వాగుపై ఉన్నలో లెవెల్ వంతెనపై ఐ లెవెల్ వంతెన ఏర్పాటు చేయాలని, ఏడు మెలకల చెక్ డ్యాం పై ఉన్న ఇసుక మేటలు తొలగించాలని,కొడవటంచ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, మరియుజిసిసి ద్వారా రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలపై గత ఐదు సంవత్సరాలలో మండల, జిల్లాఅధికారుల దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకికొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పర్శక రవి, వజ్జ ఎర్రయ్య, కల్తీ రామ్మూర్తి, వజ్జమంగయ్య, ఈసం యానయ్య, ఈసం మల్లయ్య, ఈసం కృష్ణ, ఈసం రమేష్, ఈసం రామచంద్రు, చీమల వసంతరావు, ఈసం గోపయ్య తదితరులు పాల్గొన్నారు