UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు

  • ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు
  • వచ్చే నెల 7న ముగియనున్న శ్రీనాథరెడ్డి పదవీకాలం
  • రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకారం అందించిన వారందరికీ సీఎం జగన్ వరుసగా నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఇద్దరికి నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇవాళ నామినేటెడ్ పదవులు అందుకున్న వారిలో ఏపీ ఫిలిండెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పోసాని కృష్ణమురళితో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు నియమితులయ్యారు.

ఏపీలో వివిధ మీడియా సంస్ధల తరఫున సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించిన కొమ్మినేని శ్రీనివాసరావు ప్రస్తుతం సాక్షిటీవీలో ఉన్నారు. వైఎస్ జగన్, వైసీపీ తరఫున గట్టిగా గళం వినిపిస్తున్న జర్నలిస్టుల్లో ఒకరైన కొమ్మినేనికి ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటివరకూ ఆ బాధ్యతల్లో ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పదవీకాలం తాజాగా ముగిసింది. దీంతో ఆయన స్ధానంలో కొమ్మినేనిని నియమించారు. రెండేళ్ల పదవీకాలంతో కేబినెట్ హోదాలో కొమ్మినేనిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !