UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు

  • ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు
  • వచ్చే నెల 7న ముగియనున్న శ్రీనాథరెడ్డి పదవీకాలం
  • రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకారం అందించిన వారందరికీ సీఎం జగన్ వరుసగా నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఇద్దరికి నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇవాళ నామినేటెడ్ పదవులు అందుకున్న వారిలో ఏపీ ఫిలిండెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పోసాని కృష్ణమురళితో పాటు ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు నియమితులయ్యారు.

ఏపీలో వివిధ మీడియా సంస్ధల తరఫున సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించిన కొమ్మినేని శ్రీనివాసరావు ప్రస్తుతం సాక్షిటీవీలో ఉన్నారు. వైఎస్ జగన్, వైసీపీ తరఫున గట్టిగా గళం వినిపిస్తున్న జర్నలిస్టుల్లో ఒకరైన కొమ్మినేనికి ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటివరకూ ఆ బాధ్యతల్లో ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పదవీకాలం తాజాగా ముగిసింది. దీంతో ఆయన స్ధానంలో కొమ్మినేనిని నియమించారు. రెండేళ్ల పదవీకాలంతో కేబినెట్ హోదాలో కొమ్మినేనిని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !