UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 నరరూప రాక్షసులతో రాజమౌళి మహేశ్ సినిమా

ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి మహేశ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అనౌన్స్ ఎప్పుడో చేయడంతో దాని కోసం మహేశ్ ఫ్యాన్స్ బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న జక్కన్న తిరిగి రాగానే ముహూర్తం చూసి మొదలు పెట్టే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. అయితే అప్పుడే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎప్పటి లాగే ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు.

దీంతో స్టోరీ అద్భుతంగా ఉంటుందని బాగా హోప్స్ పెట్టుకున్నారు. అయితే తాజాగా దీనిపై మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఊహించని ఫైట్ ఉంటుందని అందరూ అంటున్నారు. మహేశ్ నరరూప రాక్షసులతో తలపడనున్నాడట.. ఆ వివరాలేంటో మనం చూడొచ్చు రాజమౌళి సినిమాలో ఫైట్స్ మాములుగా ఉండవు అని. బాడీ బిల్డింగ్ ఉన్న హీరోతో పాటు.. అంతే స్థాయిలో విలన్స్ కూడా ఈ సినిమా లో ఉంటారు.

అవసరమైతే హీరోతో ఎక్సరసైజ్ లు చేయించైనా.. భారీ శరీరాన్ని ఏర్పాటు చేయిస్తాడు. ఆ విషయాన్ని నాటి ఛత్రపతి నుంచి నేటి బాహుబలి వరకు తెరపై చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మహేశ్ తో తీయబోయే సినిమాలో కూడా భారీ ఫైట్స్ ఉండే అవకాశం ఉందని అందరూ అంటున్నారు. ఆ ఫైట్స్ కూడా లోకల్ గా కాకుండా విదేశాల్లో చిత్రీకరించేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ వేస్తున్నారట మరీ. ఈ సినిమా మొత్తం అండమాన్ నికోబార్ దీవుల్లో తీసే అవకాశం ఉందని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గం. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని భారీ ఫైట్స్ చిత్రీకరిస్తారట.

ఈ ఫైట్ లో సాధారణ మనుషులు కాకుండా నరరూప రాక్షకులతో మహేశ్ తలపడేలా సెట్ చేస్తున్నారట మరీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికీ నరమాంస భక్షకులు ఉన్నారని ప్రచారం బాగానే సాగుతోంది. దీంతో సినిమాలో భాగంగా మహేశ్ అక్కడికి వెళ్లిన సందర్భంగా అక్కడి వారితో ఫైట్ చేసే విధంగా సినిమాను చిత్రీకరిస్తారట. ఇందు కోసం కొందరు ఫారిన్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించనున్నాడట జక్కన్న వివరించారు. ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజమౌళి సినిమా అంటే మినిమం వందల కోట్లు ఉంటుంది మరీ. సీన్ అద్భుతంగా రావడానికి ఖర్చు ఎంతైనా కాంప్రమైజ్ కాడు. ఆయన తీసే ప్రతీ సినిమాలో ఏదో ఒకటి హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ ఫైట్స్ ప్రధానంగా కనిపించాయి. ఇప్పుడు కూడా మహేశ్ తో తీయబోయే సినిమాలో ఫైట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశాడట. ఇందులో భాగంగా నరరూప రాక్షకులతో ఫైట్స్ పెట్టాలని అనుకున్నాట. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా ఎమ్ చేయలేదు. కానీ ఇలాంటిది ఉంటే బాటుంటుంని ఫ్యాన్ష్ చర్చించుకుంటున్నారు మరీ.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !