UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

వైకాపాలనలోనే వైద్య రంగానికి పెద్దపీట

* వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్

* 104 వాహనం ప్రారంభంలో కొత్తవారిపల్లి సర్పంచ్ మహేష్..

కె. ఈశ్వర్ – ప్రత్యేక ప్రతినిధి

అన్నమయ్య జిల్లా

వైద్య రంగానికి పెద్ద పీట వేసిన ఘనత అప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి సాధ్యమైందని,నేడు ఆయన తనయుడుసీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి కలలను నెరవేర్చేలా కృషి చేస్తున్నారని కొత్తవారిపల్లి సర్పంచ్ పి.మహేష్ బాబు అన్నారు. కొత్తవారిపల్లి పంచాయతీలో శనివారం ఆయన 104 సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్ బాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాకముందు పల్లె ప్రాంతపు ప్రజలు వైద్య సదుపాయం సరిగా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 104, 108 సేవలను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా సేవలు అందించారన్నారు. అనంతరం వచ్చిన టిడిపి ప్రభుత్వం ఈ పథకాలను తుంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు. 2019లో తిరిగి ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకుని వైద్య రంగానికి తిరిగి పెద్దపీట వేసారని కొనియాడారు, ప్రజలు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం పరుచుకోవాలన్నారు. గతంలో ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే చికిత్స కోసం మదనపల్లికి వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా 104 సేవల ద్వారా గ్రామాలకే వైద్య సదుపాయం అందేలా ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపారని కొనియాడారు. ఈ సేవలతో పాటూ దీర్ఘకాలిక రోగాలను సైతం మందులు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేష్ తో పాటు ఎంపీటీసీ రెడ్డి రాణి, డాక్టర్ సునీత, ఎ.యన్.యమ్ రజిని, వార్డ్ మెంబర్లు, సురేష్, జ్యోతి, శ్యాంమూర్తి, రమేష్ బాబు,రామ్మూర్తి, వైస్సార్సీపీ కార్యకర్తలు గ్రామప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !