UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ఎన్డీటీవీ షేర్ ధర రూ.294 చొప్పున 1.67 కోట్ల షేర్లను కొనేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్

ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చేసిన ఓపెన్ ఆఫర్‌కు తొలి రోజు స్పందన లభించలేదు. ఒక్కరూ కూడా తమ షేర్లను అమ్మడానికి ముందుకు రాలేదు. ఎన్డీటీవీ షేర్ ధర రూ.294 చొప్పున 1.67 కోట్ల షేర్లను కొనేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఎన్డీటీవీలో 26 శాతం అదనపు వాటాను సుమారు రూ.493 కోట్లకు టేకోవర్ చేసేందుకు అదానీ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్ ప్రతిపాదించింది. బీఎస్ఈలో నిన్న ఎన్డీటీవీ షేర్లు 1.56 శాతం నష్టంతో రూ.376.25 వద్ద ముగిశాయి. గత గురువారం నుంచి బీఎస్ఈలో ఎన్డీటీవీ స్టాక్ 11.17 శాతం పడిపోయింది. మంగళవారం ముగింపు విలువతో పోలిస్తే ఓపెన్ ఆఫర్ సుమారు 28 శాతం తక్కువ. ఎన్డీటీవీ షేర్‌ ఇదే ధర వద్ద కొనసాగే పక్షంలో ఓపెన్‌ ఆఫర్‌లో ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మకపోవచ్చు. ఇదే జరిగితే ఎన్డీటీవీలో అదానీలు 30 శాతం వాటాతో కొనసాగాల్సి ఉంటుంది. నిన్న మీడియా షేర్లు లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఓపెన్‌ ఆఫర్‌కు మున్ముందు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !