UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎంపిక..

జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎంపిక..

నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే పోదెం వీరయ్య..

మన్యం న్యూస్ : జూలూరుపాడు, నవంబర్ 23, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా బొడ్డు కృష్ణయ్య, ఉపాధ్యక్షులుగా లాకావత్ లచ్చు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాపలమడుగు నరసింహారావు, అడ్వైజర్ కమిటీ మెంబర్ గా ముత్తినేని రామయ్య లను నియమిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తన క్యాంపు కార్యాలయంలో బుధవారం వీరికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తమకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, అల్లడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !