UPDATES  

 ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి -తహసీల్దార్ చల్లా ప్రసాద్

మన్యం న్యూస్ అశ్వారావుపేట, నవంబర్ 25: 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్విని చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023 కార్యక్రమంలోని భాగంగా అశ్వారావుపేట 118 ఎస్టి లో ఈనెల 26, డిసెంబర్3,4 తేదీలలో ప్రత్యేకంగా ఓటర్లు నమోదు కార్యక్రమం ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలోని దమ్మపేట అశ్వరావుపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, మండలాల్లోనిపోలింగ్ కేంద్రాలలో నిర్వహించబడును ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 9వ తేదీన ప్రకటించడం జరిగింది. ఓటర్ల జాబితాకు సంబంధించి డిసెంబర్ 8వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు తెలపాలని కోరారు. సవరణలు ఓటు తొలగింపు, కొత్త ఓట్లు నమోదు జనవరి ఫస్ట్ నాటికి 18 సంవత్సరాల పైబడినట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులవుతారని ఎన్నికల సంఘం తెలిపింది. అశ్వరావుపేట 118 నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటర్ యొక్క ఆధార్ కార్డు నెంబర్ను తమ ఓటుకు 6-8 ఫారం ద్వారా అనుసంధానం చేసుకోవాలి. సంబంధిత బూతు స్థాయి అధికారులు పైన తెలిపిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !