UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు

ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో మాదిరి ఈడీ చార్జిషీటులో కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పేరు లేదు. కేవలం సమీర్‌ మహేంద్రుపై మాత్రమే చార్జిషీటు దాఖలు చేశారు. త్వరలోనే ఇతరులపై కూడా చార్జిషీటు దాఖలు చేస్తామని రౌజ్‌ అవెన్యూ కోర్టుకు ఈడీ పేర్కొంది. చార్జిషీటులను సాఫ్ట్‌ కాపీలో అంటే సీడీలో కోర్టుకు సమర్పించింది. చార్జిషీటు దాదాపు 3000 కాపీలు ఉండే అవకావముందని తెలుస్తోంది.

దీంతో వీటిని పరిశీలించి పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టుకు కొంత సమయం పట్టే అవకాశముంది. చార్జిషీటు దాఖలు చేసిన వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ ట్వీట్ చేశారు. ‘ఈడీ చార్జీషీటులో కూడా మనీష్‌ పేరు లేదు. విద్యకు సంబంధించి మనీష్‌ చేపట్టిన కార్యక్రమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించినందుకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలికదా? బాగా పనిచేసేవారిని జైల్లో పడేస్తే… దేశం ముందుకు సాగుతుందా?’ అని అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రశ్నించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !