UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 మీ పార్టీ నేతలకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

‘మీరు గెలిచింది 151 సీట్లు.. నేనేమో రెండు చోట్లా ఓడిపోయాను. నా మీద పడి ఏడుస్తారెందుకు.?’ అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు తెలిసింది సాయం చేయడం మాత్రమే. సినిమాల్లో సంపాదిస్తున్నాను.. దాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు.? ప్రభుత్వ ఖజానా నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మీ పేర్లు పెట్టుకుంటున్నారు. పైగా, అయినవారికి పదవులు కట్టబెట్టుకుంటున్నారు..

కొత్త కొత్త పదవులు ప్రవేశ పట్టి, మీ పార్టీ నేతలకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నారు..’ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలిప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. సత్తా.. తాకత్.. ‘నేను ఓడిపోయినా నన్ను చూసి 151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ భయపడుతోంది. సత్తా.. తాకత్.. అది గుండెల్లో వుంటుంది.. గెలిచే సీట్ల సంఖ్యలో వుండదు..’ అని జనసేనాని చెప్పుకొచ్చారు. ‘గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తానని ఎన్నికల సమయంలో చెప్పాను.. అదే మాటకు కట్టుబడి వున్నాను. సినిమాలు నేను చెయ్యాలి.. ఎందుకంటే, మీలా దోచుకున్న సొమ్ములేవీ నా దగ్గర లేవు…’ అంటూ జనసేనాని పంచ్ డైలాగులు పేల్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !