UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 భైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపైనా, టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీయార్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకో ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తారు.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడితే, దాన్ని అప్పుల తెలంగాణగా కేసీయార్ మార్చారు..’ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. అధికారంలోకి మనమే వస్తాం.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో భైంసాలో బహిరంగ సభను నిర్వహించారు బండి సంజయ్.

ఈ సభకు ఆటంకాలు కలిగించేందుకు, ప్రజా సంగ్రామ యాత్ర జరగనీయకుండా చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందనీ, కోర్టును ఆశ్రయించి అనుమతులు పొందామని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి తదితరులు చెప్పుకొచ్చారు. భైంసాలో హిందువుల్ని మజ్లిస్ భయపెడుతోందనీ, తెలంగాణ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే గనుక భైంసాలో హిందువులెవరూ భయపడాల్సిన పనిలేదనీ, పచ్చ జెండా (మజ్లిస్) పోతుందనీ, కాషాయ జెండా రెపరెపలాడుతుందనీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మజ్లిస్ పార్టీపై ఘాటైన ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచిత విద్య అందిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !