UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 భైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపైనా, టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భైంసాలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీయార్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకో ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తారు.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక, తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఏర్పడితే, దాన్ని అప్పుల తెలంగాణగా కేసీయార్ మార్చారు..’ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. అధికారంలోకి మనమే వస్తాం.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో భైంసాలో బహిరంగ సభను నిర్వహించారు బండి సంజయ్.

ఈ సభకు ఆటంకాలు కలిగించేందుకు, ప్రజా సంగ్రామ యాత్ర జరగనీయకుండా చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందనీ, కోర్టును ఆశ్రయించి అనుమతులు పొందామని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి తదితరులు చెప్పుకొచ్చారు. భైంసాలో హిందువుల్ని మజ్లిస్ భయపెడుతోందనీ, తెలంగాణ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే గనుక భైంసాలో హిందువులెవరూ భయపడాల్సిన పనిలేదనీ, పచ్చ జెండా (మజ్లిస్) పోతుందనీ, కాషాయ జెండా రెపరెపలాడుతుందనీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మజ్లిస్ పార్టీపై ఘాటైన ఆరోపణలు గుప్పించారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచిత విద్య అందిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !