UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 చిన్నారి ప్రాణం తీసేసిన ఛార్జర్.!

మొబైల్ ఫోన్లు పేలతాయ్.. మొబైల్ ఫోన్ ఛార్జర్లూ ప్రాణాలు తీసేస్తాయ్.! చాలాసార్లు ఇలాంటి ఘటనల గురించి విన్నాం, వింటూనే వున్నాం. లోపాలున్న మొబైల్ ఫోన్ల తయారీ ఓ వైపు, వాటిని నిర్లక్ష్యంగా వినియోగించడం ఇంకో వైపు.. వెరసి.. తప్పులు రెండు వైపులా జరుగుతున్నాయి. తాజాగా పదేళ్ళ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జర్‌కి బలైపోయింది. తెలంగాణ లోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, పదేళ్ళ చిన్నారి నిహారిక, మొబైల్ ఫోన్ ఛార్జర్‌ని స్విచ్ బోర్డు నుంచి తీస్తుండగా షాక్‌కి గురైంది.

విద్యుత్ సరఫరా సమస్యలతోనే.. గత కొంతకాలంగా విద్యుత్ సరఫరా సమస్యలు వున్నాయనీ, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదనీ విద్యుత్ అధికారులపై మృతురాలి తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. హై ఓల్టేజీ ఆ సమయంలో వుండడంతో, ఛార్జర్ పట్టుకోగానే షాక్ కొట్టి తమ చిన్నారి చనిపోయిందని మృతురాలు నిహారిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు పెదవి విప్పలేదు. అయితే, పదేళ్ళ చిన్నారి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ప్లగ్ తీసేటప్పుడు ఆ పిన్ వద్ద మెటల్‌ని తాకితే షాక్ కొట్టే అవకాశాలుంటాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !