UPDATES  

 బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

టిఆర్ఎస్ పార్టీ నాయకులను వదిలి పెట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ డ్రగ్స్ పేకాట దందా చేసేటి వాళ్ళ అంతు చూస్తాం. కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. టిఆర్ఎస్ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు అందాయి. బెంగళూరు పోలీసులను మేనేజ్ చేసి కేసును మూసేపించారు. ఆ కేసు ను మళ్ళీ బయటికి తీసుకొస్తాం. కేసీఆర్ ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి పరిపాలన వల్లే దేశం అభివృద్ధి సాగుతుందని తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలని బండి అభిప్రాయం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ దే విజయం అంటూ బండి ధీమా వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !