UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 టెస్లా యొక్క షేర్ల విలువ భారీగా పతనం

ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అనూహ్యంగా తన ఆస్తిని కోల్పోతూ ఉన్నాడు. అతి తక్కువ సమయంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపదను ఆయన కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్ దాని వల్ల తీవ్ర నష్టాల పాలయ్యాడు అంటూ ప్రచారం జరగడంతో ఆయన టెస్లా యొక్క షేర్ల విలువ భారీగా పతనం అయింది. ప్రతి రోజు మంచులా ఆయన ఆస్తి కరిగి పోతూ ఉండడానికి కారణం టెస్లా షేర్ల యొక్క పతనమే కారణం అంటూ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

సుదీర్ఘ కాలంగా ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ గా నిలుస్తూ వచ్చిన మస్క్ ఇప్పుడు నెంబర్ 2 స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విల్టన్ పేరెంట్ కంపెనీ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ప్రాన్స్ కి చెందిన ఈయన 188.6 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో ఉండగా.. మస్క్ 176 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ట్విట్టర్ కొనుగోలు చేసి మస్క్‌ చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ ఆయన సన్నిహితులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగానే టెస్లా యొక్క స్థాయి తగ్గింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి అత్యంత దారుణమైన పరిస్థితిని ఎలాన్‌ మస్క్ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. దీని నుండి ఆయన ఎలా బయటపడతాడో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !