UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 నా ప్రాణాలు అడ్డుపెట్టైనా పార్టీ కోసం పనిచేసేవారిని కాపాడుకుంటా..

పార్టీ కోసం పని చేసేవారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కందుకూరు బహిరంగ సభలో జరిగిన దురదృష్టకరమైన ఘటనపై స్పందిస్తూ.. కందుకూరు సభకు వేలాది మంది ప్రజలు వచ్చారు.. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా నేను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదు.. పోలీసులు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు.. కందుకూరులో నేను సభ పెట్టిన ప్రాంతంలో గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, వైఎస్ జగన్, సినీ నటులు కూడా బహిరంగ సభలు పెట్టారని గుర్తుచేశారు.. అయితే, ప్రమాదానికి ముందే పోలీసులను హెచ్చరించినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు ఇవే.. మరోవైపు, కందుకూరులో మృతులకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించామని గుర్తుచేశారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తర్వాత రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారని విమర్శించారు.. 8 మంది టీడీపీ కార్యకర్తల్ని కోల్పోయి బాధలో ఉంటే.. పుండుమీద కారం చల్లినట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. పార్టీ కోసం పని చేసే వారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని వెల్లడించారు.. ఇక, హుదూద్ తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేశామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.. 10 రోజులు విశాఖలోనే ఉండి బాధ్యతగా పనిచేశానన్న ఆయన.. రాజేశ్వరి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 28వ తేదీన నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకున్న విషయం విదితమే.. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !