మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి9ః ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పసుమర్తి శేషగిరిరావు అన్నారు. సోమవారం ఆర్యవైశ్య సంఘం మండల కమిటి ఆద్వర్యంలో నూతన సంవత్సరం2023 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంఘం బలోపేతానికి ప్రతి యొక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా యువజన విభాగం మాజీ అధ్యక్షులు కొదుమూరి దయాకర్రావు, మండల నాయకులు కుక్కడపు రామారావు,కుక్కడపు వెంకటేశ్వరరావు, చిట్లూరి సుధాకర్రావు, భద్రరావు, ప్మనాధుని క్రిష్ణరావు, నేరేళ్ల లక్ష్మణావు, తదితరులు పాల్గొన్నారు.