UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మగాడివని నిరూపించుకో.. CM JAGAN కు LOKESH సవాల్‌

ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. అధికార వైకాపా పై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంది. ఇదే సమయంలో గతంలో అధికారంలో ఉన్న సమయంలో వైకాపా నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విపరీతమైన అవినీతికి పాల్పడింది అంటూ అధికార పార్టీ నాయకులు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైకాపా నాయకులు టిడిపి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని ఆ స్కాంలో తెలుగు దేశం పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మరియు నారా లోకేష్ కి కూడా పాత్ర ఉందంటూ ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఎప్పటి మాదిరిగానే తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నిరాశలో కూరుకు పోయిన మీరు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కొత్త ఆరోపణ తెర పైకి తీసుకు వచ్చారు. అధికారంలో ఉన్న మీరు 24 గంటల్లో ఆధారాలతో సహా దమ్ముంటే ఆ ఆరోపణను నిరూపించాలని అంటూ లోకేష్ సవాల్ విసిరారు. బహిరంగంగా పోరాడి మగాడివని నిరూపించుకోవాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లోకేష్ సవాల్ విసిరారు. ఈ సవాల్ కి వైకాపా శ్రేణులు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !