UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 గొంతు కోసం పైశాచికత్వం ప్రదర్శించి.!డెంటల్ విద్యార్ధినిపై ఉన్మాది ఘాతుకం.!

ఆ అమ్మాయి పేరు తపస్వి. బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ కోర్సు చేస్తోంది. త్వరలో పరీక్షలు వుండడంతో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన తేజస్వినిని కాపు కాసి హతమార్చాడు ఓ కసాయి. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఈ ఘోరం చోటు చేసుకుంది. తపస్వి చాలా మంచి అమ్మాయి. ధైర్యవంతురాలు కూడా. గత కొన్నాళ్లుగా ఓ సాప్ట్‌వేర్ కుర్రోడు తేజస్వినిని ప్రేమ, పెళ్లి.. అంటూ వేధింపులకు గురి చేశాడట. ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పరిచయమైన ఆ కుర్రోడు, తపస్విని ప్రేమిస్తున్నాననీ, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడట. స్నేహితురాలి కళ్ల ముందే.. ఈ విషయమై గతంలో ఒకసారి పోలీసుల కు ఫిర్యాదు కూడా చేసింది తపస్వి. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారట.

కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన పైశాచికత్వం ప్రదర్శించాడా కసాయి. చివరికి కాపు కాసి, స్నేహితురాలి ఇంట్లో వుండగానే తన కసాయితనం ప్రదర్శించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, తపస్విపై సర్జికల్ బ్లేడుతో దాడి చేశాడు. అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. స్నేహితురాలి కళ్ల ముందే తపస్విని కసి తీరా చంపేశాడా మానవ మృగం. భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్న తపస్వి జీవితం మధ్యలోనే ఇలా కడతేరిపోవడం విషాదం. నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ తపస్వి కుటుంబ సభ్యులతో పాటూ, స్థానికులూ కోరుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !