UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 వెకేషన్‌కు jr NTR..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

కొరటాల శివతో ఆయన తన తదుపరి చిత్రానికి సంతకం చేసినప్పటికీ అది ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఆచార్య పరాజయంతో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ.. తారక్‌తో సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్టు విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మార్పులు చేస్తున్నారట. అందుకే సినిమా ఆలస్యమవుతుందని సమాచారం. ఇందుకు మరికొంతకాలం పట్టే అవకాశముందని తెలియడంతో మన యంగ్ టైగర్ ఫ్యామిలీతో కలిసి హాలీడేకు ప్లాన్ చేశారని ఫిల్మ్ వర్గాల సమాచారం.

ఓ వారం రోజుల పాటు అమెరికాలో కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్దామని తారక్ ప్లాన్ చేశారట. ఈ మేరకు భార్య పిల్లలతో కలిసి విమానాశ్రయంలో చేరుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ కూడా ఉండటం ఈ ఫొటోల్లో గమనించవచ్చు. ముగ్గురిని అలా ఒకేసారి చూడటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కనుంది. ఆచార్య పరాజయంపై ఈ సినిమాపై పడకూడదని.. తారక్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్లు అంతర్గత వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పాన్ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం తెలియజేయనుంది.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందుతొంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాదే పట్టాలెక్కనుంది.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !