UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 అర్జున్ రెడ్డి తర్వాత హిట్-2దే రికార్డు..

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మేజర్ లాంటి సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్.. ఇప్పుడు హిట్-2 రూపంలో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. వసూళ్ల పరంగా అదరగొడుతున్న హిట్-2 ఓవర్స్ సీస్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అమెరికాలో ఈ చిత్రం ఒక మిలియన్ డాలర్లను పైచిలుకు వసూళ్లను అందుకుంది.

తొలి వారంంతంలోనే కాకుండా సెకెండ్ వీకెండ్‌లో హిట్-2 వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం పడలేదు. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం, వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో హిట్-2కు ఆదరణ ఎక్కువగా ఉంది. యూఎస్ఏలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ డీసెంట్ వసూళ్లు రాగా.. రెండో వీకెండ్‌కు ఒక మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. దీంతో అడివి శేష్ ఈ ఏడాదే తను నటించిన రెండు సినిమాలకు ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటికే మేజర్ చిత్రం కూడా ఒక మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది.

తాజాగా హిట్-2 ఈ రికార్డును అందుకుంది. అంతేకాకుండా సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికేట్ పొంది ఒక మిలియన్ డాలర్ మార్కును అందుకున్న రెండో తెలుగు చిత్రంగా హిట్-2 రికార్డు సృష్టించింది. అంతకుముందు అర్జున్ రెడ్డి సినిమా ఈ విధంగా వసూళ్లను అందకుంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని నిర్మించిన ఈ సినిమా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. మొత్తంగా రూ.60 కోట్ల గ్రాస్‌కు సమీపంలో ఉంది.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నెని ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా పనిచేయగా.. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాను డిసెంబరు 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !