UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 అమిత్ షా మధ్యవర్తిత్వం .. వివాదం ఉద్రిక్తం

సరిహద్దు సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున, ఆరుగురు సభ్యులతో మంత్రుల కమిటీ ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర, కర్నాటక అంగీకరించాయి. Maharashtra, Karnataka border issue: 1950ల నుంచి.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటైన సమయంలో బెలగావి ప్రాంతంలోని మరాఠీ మాట్లాడే సుమారు 865 గ్రామాలను అన్యాయంగా కర్నాటకలో కలిపారని చాలా ఏళ్లుగా మహారాష్ట్ర వాదిస్తోంది. ఆ వాదనను కర్నాటక అంగీకరించడం లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నిర్ధారించిన సరిహద్దు రేఖనే అంతిమమని కర్నాటక స్పష్టం చేస్తోంది. బెలగావి తమదేనని నిర్ధారించడానికి అక్కడ ప్రత్యేకంగా విధాన సౌధను కూడా నిర్మించింది. ఈ సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

\Maharashtra, Karnataka border issue: అమిత్ షా మధ్యవర్తిత్వం ఇటీవల ఈ వివాదం ఉద్రిక్తంగా మారింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ట్రక్ లను కర్నాటకలో ధ్వంసం చేశారు. కర్నాటకలో తిరగనివ్వబోమని వాటిని అడ్డుకున్నారు. మరోవైపు, కర్నాటక బస్సులను పుణెలో శివసేన(ఉద్ధవ్ వర్గం) ధ్వంసం చేశారు. ఈ వివాదం రాజకీయంగా కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడంతో, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడుం బిగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో మహారాష్ట్రర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కర్నాటక హోం మంత్రి కూడా పాల్గొన్నారు.

Maharashtra, Karnataka border issue: ముఖ్యమంత్రుల భేటీ సీఎంల సమావేశం అనంతరం ఆ వివరాలను అమిత్ షా మీడియాకు వెల్లడించారు. ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలని, సుప్రీం తీర్పును అంగీకరించాలని షా ఇరు రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేశారు. వీధి పోరాటాల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదని, అనవసరంగా దీన్ని రాజకీయాంశం చేయవద్దని సూచించారు. సమస్య పరిష్కారానికి సూచనలు చేసేందుకు రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున, ఆరుగురు సభ్యులతో మంత్రుల కమిటీ ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేసినా, ఉద్రిక్తతలు పెరిగేలా పోస్ట్ లు పెట్టినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !