UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 తన కొడుకును కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను విమర్శిస్తూ తన పాదయాత్రను వైఎస్ షర్మిల కొనసాగిస్తోంది. అయినా సరైన గుర్తింపు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కొడుకును కూడా వెంటబెట్టుకుని రాజకీయ పోరాటం చేస్తుందా? అనేది అందరి మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న. ఇక్కడ తన ప్రాతినిధ్యం దక్కాలంటే ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. షర్మిల వెంట త్వరలోనే ఆమె కొడుకు కూడా రాజకీయాల్లోకి వస్తాడా? అందుకే ఇప్పుడు హఠాత్తుగా అతడి ఫొటోను షేర్ చేసిందా? అన్న అనుమానాలు రాక మానడం లేదు.

తెలంగాణలో ఇప్పటి వరకు షర్మిల పార్టీకి సరైన గుర్తింపు దక్కలేదు. కనీసం ఓ పార్టీగా కూడా గుర్తించడం లేదు. కేఏ పాల్ పార్టీలా చేస్తున్నారు. పార్టీకి పవర్ దక్కాలంటే పార్టీల్లో మంచి అభిప్రాయం రావాలంటే కొన్ని ట్రిక్కులు ప్లే చేయక తప్పదు. అందుకే తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చి అతడి ద్వారా తన కలలను నెరవేర్చుకోవాలని చూస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. . ఏదిఏమైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తమ పలుకుబడి పెరగడం ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్లు పలు సంఘటనలు రుజువు చేశాయి. ఈ కోణంలోనే షర్మిల కూడా ఆలోచించి పార్టీకి జవసత్వాలు నింపేందుకు తన కొడుకును కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి తేబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !