UPDATES  

 తన కొడుకును కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను విమర్శిస్తూ తన పాదయాత్రను వైఎస్ షర్మిల కొనసాగిస్తోంది. అయినా సరైన గుర్తింపు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కొడుకును కూడా వెంటబెట్టుకుని రాజకీయ పోరాటం చేస్తుందా? అనేది అందరి మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న. ఇక్కడ తన ప్రాతినిధ్యం దక్కాలంటే ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. షర్మిల వెంట త్వరలోనే ఆమె కొడుకు కూడా రాజకీయాల్లోకి వస్తాడా? అందుకే ఇప్పుడు హఠాత్తుగా అతడి ఫొటోను షేర్ చేసిందా? అన్న అనుమానాలు రాక మానడం లేదు.

తెలంగాణలో ఇప్పటి వరకు షర్మిల పార్టీకి సరైన గుర్తింపు దక్కలేదు. కనీసం ఓ పార్టీగా కూడా గుర్తించడం లేదు. కేఏ పాల్ పార్టీలా చేస్తున్నారు. పార్టీకి పవర్ దక్కాలంటే పార్టీల్లో మంచి అభిప్రాయం రావాలంటే కొన్ని ట్రిక్కులు ప్లే చేయక తప్పదు. అందుకే తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చి అతడి ద్వారా తన కలలను నెరవేర్చుకోవాలని చూస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. . ఏదిఏమైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తమ పలుకుబడి పెరగడం ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్లు పలు సంఘటనలు రుజువు చేశాయి. ఈ కోణంలోనే షర్మిల కూడా ఆలోచించి పార్టీకి జవసత్వాలు నింపేందుకు తన కొడుకును కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి తేబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !