UPDATES  

 జపాన్‌లలో కోవిడ్ కేసుల సంఖ్య భయంకరమైన స్థాయిలో

చైనా, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, దక్షిణ కొరియా, జపాన్‌లలో కోవిడ్ కేసుల సంఖ్య భయంకరమైన స్థాయిలో పెరగడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా భారతదేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ దేశాల నుండి విమాన ప్రయాణాన్ని నియంత్రించాలని వివిధ ప్రముఖుల నుండి అభ్యర్థనలు వచ్చినప్పటికీ, భారతదేశంలో ఇటీవల కేసులు పెరగనందున భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తోంది. ప్రతి కరోనావైరస్ పాజిటివ్ శాంపిల్ జన్యు శ్రేణి విశ్లేషణను పెంచడానికి మంగళవారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒక ఆదేశాలు జారీచేశారు. భారతదేశంలో వారానికి 1200 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని చెప్పారు. ఇక బుధవారం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ భారతదేశ జనాభాలో 27-28% మంది మాత్రమే ఇప్పటి వరకు బూస్టర్ డోస్ తీసుకున్నారని తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘కేవలం 27-28% మంది మాత్రమే ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారు. ఇతరులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం..’ అని డాక్టర్ పాల్ చెప్పారు. కొమార్బిడిటీ ఉన్న వ్యక్తులు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు ఇంటి లోపల, ఆరుబయట, రద్దీగా ఉండే ప్రదేశాలలో కూడా మాస్క్ ధరించాలని డాక్టర్ పాల్ చెప్పారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్న వారు వీలైనంత త్వరగా బూస్టర్ డోస్ తీసుకోవడం తప్పనిసరి అని పాల్ చెప్పారు. బూస్టర్ డోస్ సెంటర్లు ఇలా తెలుసుకోండి కో-విన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న బూస్టర్ డోస్ కేంద్రాల సమాచారాన్ని పొందవచ్చు. మీకు సమీపంలోని బూస్టర్ డోస్ సెంటర్ కోసం కో-విన్ పోర్టల్‌ని ఓపెన్ చేయాలి. – ‘మీ సమీప టీకా కేంద్రాన్ని శోధించండి’ అనే ఆప్షన్ చూసేందుకు విండోను క్రిందికి స్క్రోల్ చేయండి – ఇక్కడ మీరు జిల్లా, పిన్ కోడ్ లేదా మ్యాప్‌లో సెంటర్ తెలుసుకోవచ్చు. – జిల్లా కోసం మీరు రాష్ట్రం పేరు, జిల్లా పేరును నమోదు చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయాలి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !